పుష్పలో ఐటమ్ సాంగ్ టైంలో.. నాగచైతన్యపై సమంత కామెంట్స్

సినిమా పిల్లర్- తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా జంటల మాదిరిగానే అక్కినేని నాగచైతన్య, సమంతలు సైతం విడిపోయారు. ఐతే ప్రేమించి పెళ్లి చేసుకున్న చై-సమంతలు ఏ కారణంతో విడిపోయారన్నది మాత్రం ఇప్పటివరకు ఇద్దరిలో ఏ ఒక్కరు చెప్పలేదు. సమంత, నాగ చైతన్యలు విడిపోయిన తరువాత ఎవరికి తోచిన కారణాన్ని వాళ్లు చెబుతూ వస్తున్నారు. ఐతే అప్పుడప్పుడు సమంత తన వ్యాఖ్యల ద్వార సినిమాల్లో తన పాత్రలకు సంబందించి నాగ చైతన్య ఆంక్షలు పెట్టినట్లు మాత్రం ఇండైరెక్ట్ గా చెబుతూ వస్తోంది. తాజాగా సమంత తాను నాగచైతన్య నుంచి విడిపోవడం గురించి ఇలాంటి కామెంట్సే చేసింది.

సమంత తాజా సినిమా శాకుంతలం ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె వరుసగా ప్రమేషన్స్ లో పాల్గొంటోంది. ఈ సందర్బంగా తన వ్యక్తిగత జీవితంపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సినిమా ‘పుష్ప’ లో ఐటెమ్‌ సాంగ్‌ చేయడంపైనా స్పందించింది సమంత. నాగచైతన్యతో వైవాహిక బంధానికి స్వస్తి పలికిన కొంతకాలానికే తనకు పుష్ప సినిమాలో ..ఊ అంటావా మావ.. ఐటమ్ సాంగ్  ఆఫర్‌ వచ్చిందని, నేనఏ తప్పు చేయనప్పుడు బాధపడుతూ ఇంట్లోనే ఎందుకు కూర్చోవాలనిపించిందని చెప్పుకొచ్చింది సమంత. 

ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే పుష్ప సినిమాలో ఊ అంటాావా మావ సాంగ్ కు ఓకే చెప్పేశానని అందు. తాను ఆ ఐటమ్ సాంగ్ ను అనౌన్స్‌ చేసినప్పుడు ఫ్యామిలీ మేంర్స్, తెలిసినవాళ్లు ఫోన్ చేసి.. ఇంట్లో కూర్చో చాలు, విడిపోయిన వెంటనే నువ్వు ఐటెమ్‌ సాంగ్స్‌ చేయడం బాగోదని సలహాలు ఇచ్చారని చెప్పింది సమంత. తనను ఎప్పుడూ ప్రోత్సహించే స్నేహితులు సైతం ఆ పాటను చేయొద్దనే అన్నారని, కానీ తాను మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదంది. వైవాహిక బంధంలో తాను వంట శాతం నిజాయతీగా ఉన్నానని, కాకపోతే అది వర్కౌట్‌ కాలేదని చెప్పుకొచ్చింది. అలాంటప్పుడు తానేదో నేరం చేసిన దానిలాగా ఎందుకు ఇంట్లో దాక్కోవాలి, చేయని నేరానికి నన్ను నేను హింసించుకుని, ఎందుకు బాధపడాలి.. అని ప్రశ్నించింది సమంత.
 


Comment As:

Comment (0)