123

టిక్కెట్ కొనుక్కుని మరీ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన చంద్రబాబు 

స్పెషల్ రిపోర్ట్- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. కోనసీమ జిల్లాలో (Konaseema) పర్యటిస్తున్న చంద్రబాబు ఎక్కడికక్కడ ప్రజలతో మాట్లాడుతున్నారు. మార్గమధ్యలో జనంతో మమేకమవుతున్నారు. ఈ క్రమంలో ఆలమూరు నుంచి జొన్నాడ వరకు చంద్రబాబు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. కండక్టర్ నుంచి టిక్కెట్  కొనుక్కున్న చంద్రబాబు.. బస్సులోని ప్రయాణీకులతో మాట్లాడారు. ప్రధానంగా మహిళల ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి తమ ప్రభుత్వం రాగానే అందరి సమస్యలు తీరతాయని భరోసా కల్పించారు చంద్రబాబు. 


Comment As:

Comment (0)