తన కుమారుడిని చూస్తే గర్వంగా ఉందన్న నమ్రత
గౌతమ్ కు ధన్యవాదాలు తెలిపిన నమ్రతా మహేశ్ బాబు
స్పెషల్ రిపోర్ట్- సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) సినిమాల్లో నటించడమే కాదు సమాజ సేవలోను ముందుంటారు. సామాజిక సేవలో భాగంగా ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి తన మంచి మనసు చాటుకున్నారు మహేశ్ బాబు. ఇప్పుడు మహేశ్ బాబు బాటలోనే నడుస్తున్నాడు ఆయన తనయుడు గౌతమ్ ఘట్టమనేని (Gautam Ghattamaneni). గుండె ఆపరేషన్ చేయించుకున్న చిన్నారులను హాస్పిటల్ కు వెళ్లి పరామర్శిస్తున్నాడు గౌతమ్. వాళ్లలో మనోధైర్యాన్ని నింపుతూ తన మంచి మనసును చాటుకుంటున్నాడు. ఈ విషయాన్ని చెబుతూ నమ్రత ఘట్టమనేని (Namrata Shirodkar) ఓ ఎమోషనల్ నోట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గుండె కు సంబందించిన చికిత్స తీసుకుంటున్న ఓ చిన్నారితో గౌతమ్ ఉన్న ఫొటోను నమ్రత షేర్ చేశారు. గౌతమ్ ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని ఈ సందర్బంగా కామెంట్ చేశారు.
గుండె సంబందింత ఆపరేషన్ చేయించుకున్న చిన్నారులను కలవడానికి గౌతమ్ రెయిన్బో హాస్పిటల్ కు వెళ్తాడని నమ్రత చెప్పారు. ఇప్పటి వరకు చాలా మంది చిన్నారులకు మహేశ్ ఫౌండేషన్ (MB Foundation) పేరుతో గుండె ఆపరేషన్లు చేయించినట్లు నమ్రత పేర్కొన్నారు. నమ్రత ఘట్టమనేని (Namrata Ghattamaneni) ఏంచెప్పారంటే.. ఎంబీ ఫౌండేషన్లో భాగమైన గౌతమ్.. చికిత్స తీసుకుంటున్న పిల్లలతో కలిసి సమయాన్ని గడుపుతాడు. క్యాన్సర్ బారిన పడిన పిల్లల్లో గుండె ధైర్యాన్ని నింపుతాడు. వాళ్ల కోసం గిఫ్స్ట్ తీసుకెళ్తాడు. చిరునవ్వులను చిందించే చిన్నారులను చూసి తను ఎంతో సంతోషిస్తాడు. ఇలా చేయడం వల్ల ట్రీట్మెంట్ తీసుకుంటున్న చిన్నారులు త్వరగా కోలుకుంటుంటారు. వాళ్లకు అండగా నిలుస్తున్నందుకు గౌతమ్కు ధన్యవాదాలు.. అని నమ్రత చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నమ్రత గౌతమ్ గురించి పెట్టిన పోస్ట్ టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు అంతా గౌతమ్ ను ప్రసంశలలో ముంచెత్తుతూ పోస్ట్ లు పెడుతున్నారు.