Newspillar
Newspillar
Friday, 01 Sep 2023 18:30 pm
Newspillar

Newspillar

స్పోర్ట్స్ రిపోర్ట్-  క్రికెట్ అభిమానులకు నిరాశే ఎదురైంది. వర్షం కారణంగా భారత్, పాక్‌ (IND vs PAK) క్రికెట్ మ్యాచ్‌ క్యాన్సిల్ అయ్యింది. దీంతో రెండు జట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. మ్యాచ్‌ ప్రారంభం నుంచే వర్షం ఆటంకం కలిగిస్తూనే ఉంది. ముందు భారత్ ఇన్నింగ్స్‌కు వరుసగా వర్షం రెండు సార్లు అంతరాయం కలిగించింది. అయినప్పటికీ మొత్తమ్మీద టీమ్‌ ఇండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. ఆ తరువాత మళ్లీ వర్షం ప్రారంభమైంది.

ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో గ్రౌండ్ ను కవర్లతో కప్పి ఉంచారు. ఇక చేసేది లేక ఆటగాళ్లు డగౌట్‌ కే పరిమితమయ్యారు. ఆ తర్వాత వర్షం కాస్త తగ్గడంతో మ్యాచ్‌ ఆడేందుకు గ్రౌండ్ ను సిద్ధం చేశారు. ఆటగాళ్లు కూడా గ్రౌండ్‌ లోకి అడుగుపెడుతుండగా మళ్లీ చిన్న పాటి వర్షం ప్రారంభమైంది. దీంతో ఆటగాళ్లు మరోసారు డగౌట్‌ లోకి వెళ్లిపోయారు. మెల్ల మెల్లగా వర్షం మరింత ఎక్కువైంది. దీంతో మ్యాచ్‌ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించగా, భారత్, పాక్ జట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. Asia Cup 2023