Newspillar
Newspillar
Tuesday, 05 Sep 2023 18:30 pm
Newspillar

Newspillar

అనంతపురం రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్‌ (CM Jagan) పాలనలో అన్నీ అరాచకాలేనని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu) ఫైర్ అయ్యారు. జగన్ సైకో పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉపాధ్యాయులు, విద్యావంతులు, న్యాయవాదులు, మేధావులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు ఉపాధ్యాయులు, మేదావులు తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకురాగా, అధికారంలోకి రాగానే అందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వైఎసాస్సార్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆస్తుల దోపిడీ జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. 

వైసీపీ (YCP) విధ్వంస పాలనను ప్రజలు చూస్తూనే ఉన్నారన్న చంద్రబాబు.. జగన్‌ సైకో సీఎం మాత్రమే కాదు, కరడుగట్టిన సైకో అని మండిపడ్డారు. రైతులకు కూడా చెప్పకుండా భూముల్లో కాల్వలు తవ్వుతున్నారని, తప్పులను ప్రశ్నిస్తే అడ్డుకునే పరిస్థితి ఉందని అన్నారు. ఇసుక అక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో కేసులు వేసిన నాగేంద్రను పనిగట్టుకుని వేధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రేపో, ఎల్లుండో నన్ను అరెస్టు చేయొచ్చు, లేదంటే తనపై దాడి చేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఏ తప్పూ చేయలేదన్న చంద్రబాబు నిప్పులా బతికానని చెప్పారు.